వరంగల్ సీపీ తరుణ్జోషి
జనగామ, బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ల తనిఖీ
జనగామ, మే 10(నమస్తే తెలంగాణ)/ బచ్చన్నపే ట: సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పోలీసు అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్న బాధితులు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటే మరికొందరు వారి బారినపడకుండా ఉంటారని ఆయన సూచించారు. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారి ఆయన జనగామ, బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ను సంద ర్శించి రికార్డులు తనిఖీ చేశారు. తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్రాంగణాన్ని మొక్కలు, పూల తోటలతో తీర్చిదిద్దాలని సూ చించారు. అనంతరం రిసెప్షన్ కౌంటర్ తీరును పరిశీలించి అక్కడి మహిళా కానిస్టేబుల్ ను వివరాలు అడిగి తెలుసు కున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా నమోదయ్యే కేసుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. నేరాల నియంత్ర ణతోపాటు సీసీ కెమె రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు, జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల నివా రణకు చేపట్టిన జాగ్రత్తలపై ఆరా తీశారు. విధుల్లో రాణిం చేందుకు రూపొందించిన వర్టికల్స్ పనితీరుపై ఆరా తీశారు. ఆయన వెంట జనగామ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్కుమార్, అ ర్బన్ సీఐ మల్లేశం, బచ్చన్నపేట సీఐ కరుణాకర్, ఎస్సైలు శ్రీనివాస్, ర వికుమా ర్, జలగం లక్ష్మణ్రావు, ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, సుమలత ఉన్నారు.