న్యాల్కల్, ఆగస్టు 12: రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ అన్నారు. నిమ్జ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రా మ శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి మద్దతు పలికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే న్యాల్కల్ మండలాన్ని నిమ్జ్ పారిశ్రామిక ప్రాంతం పేరుతో నాశనం చేశారని, మళ్లీ కొత్తగా 2వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి భూములు గుంజుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఫార్మాసిటీ కోసం ఎలాం టి సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా భూసర్వే చేపట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులకు అండ గా ఉంటూ వారి పక్షాన ఫార్మాసిటీకి వ్య తిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలిచి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రజలు, రైతులు ఎవరూ సహించరన్నారు. పార్టీలకతీతం గా ప్రజలు, రైతులందరూ కలిసి ఫార్మాసిటీకి వ్యతికరేకంగా పోరాటం చేయాలన్నారు.
అనంతరం ఫార్మాసిటీలో కోల్పోతున్న రైతుల భూములను పరిశీలించారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయవద్ద ని జహీరాబాద్ ఆర్డీవో రాజుకు రైతుల తో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు మం త్రుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో జహీరాబా ద్, న్యాల్కల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ మండలాధ్యక్షులు నారాయణ, రవీందర్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవికుమార్, సుభాశ్గుప్తా, నర్సింహారెడ్డి, విజయ్కుమార్, గుండప్ప, సం గ్రాంపటేల్, శ్రీకాంత్రెడ్డి, మారుతీయాదవ్, శ్రీపాతి, రాజుగౌడ్, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, శివరాజ్, అశోక్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.