Interview | జహీరాబాద్, ఆగస్టు 25: తొమ్మిదేండ్లలో జహీరాబాద్ నియోజకవర్గంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు గడపగడపకూ అందించాం. జహీరాబాద్ పట్టణంలో 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో చేసింది. మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పట్టణంలో ప్రధాన రోడ్డుపై డివైడర్ల నిర్మాణం చేపట్టి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికీ మిషన్భగీరథతో తాగునీటిని సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేసి పంటల దిగుబడి పెంచాం. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్ ఏర్పాటు చేసి భారీ పారిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పుట్టి పెరిగింది ఝరాసంగంలో.. ఇక్కడి ప్రజల కష్టాలు నాకు బాగాతెలుసు…వాటిని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తాను. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికేతరులు వారికి నియోజకవర్గ ప్రజల సమస్యలపై అవగాహన లేదు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది జహీరాబాద్లో ఉండి ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలో 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు కృషితో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయి. సీఎం కేసీఆర్ నాకు మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధిస్తాను. నియోజకవర్గ ప్రజలే నా బలగం.. సీఎం కేసీఆరే నా బలం..అన్న జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొనింటి మాణిక్రావు ‘నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేయడంతో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాం. నియోజకవర్గంలో ఉన్న 138 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి సీఎం కేసీఆర్ రూ.20 లక్షలు మంజూరు చేశారు. జహీరాబాద్ పట్టణంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అత్యవసర వైద్యకేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. శిశువులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు మాతా, శిశు దవాఖానను మంజూరు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ లో రెవెన్యూ డివిజన్ కేంద్రం, పోలీసు సబ్ డివిజన్ కేంద్రా న్ని, కొత్తగా మొగుడంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేసేందుకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసింది. ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు, గిరిజన తండాలకు కొత్తగా రోడ్లు వేశాం. జహీరాబాద్ పట్టణంలో 1100 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేసి పంపిణీ చేశాం. దేవాలయాలు, మసీదులు, చర్చిలను అభివృద్ధి చేశాం. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ది. ఎస్డీఎఫ్ నిధులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశాం. కులసంఘాలకు సామూహిక భవనాల నిర్మాణం చేపట్టాం. గతంలో ఏ ప్రభుత్వం కులసంఘాలకు సామూహిక భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు. ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్ మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు సహకారంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తాను. 2014 ఎన్నికల్లో 840 ఓట్లతో ఓడిపోయాను. 2018 ఎన్నికల్లో 34వేల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డిపై విజయం సాధించాను. ఒక అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ప్రజలకు కోరాను. వారు నమ్మి ఓట్లు వేశారు. వారి నమ్మకంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. మరోసారి జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నావెంటే ఉన్నారు. రెండోసారి నియోజకవర్గ ప్రజల సహకారంతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కోసం కృషి చేశాను.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: గత శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాం. ప్రజలకు హామీ ఇవ్వకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని, మొగుడంపల్లిని మండలం చేసింది. జహీరాబాద్ పట్టణంలో మాతా, శిశు దవాఖానను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం నీటితో సింగూర్ ప్రాజెక్టును నింపి జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1.06లక్షల వ్యవసాయ భూమికి సాగునీరు అందించేందుకు పనులు చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం పనులు చేస్తుంది.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 12,500 ఎకరాల్లో జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. చదువుకున్న ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకే ప్రాధాన్యత ఉంటుంది.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నది. దళితులకు దళితబంధు, బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం చేశాం. మైనార్టీకు రూ.లక్ష ఆర్థికసాయం చేస్తున్నాం. గిరిజనులకు పోడుపట్టాలు పంపిణీ చేశాం. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాం. వారు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం ఉంది. గత ప్రభుత్వాల వైఫల్యంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు చేయడంతో ప్రజల గుండెల్లో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారు.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: నియోజకవర్గంలో ఉన్న ముఖ్యనాయకులు, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఎన్నికల ప్రచారం చేస్తా. గత రెండు ఎన్నికల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి అవకాశం కల్పించడంతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ రావడానికి నాయకులు, కార్యకర్తల సహకారం ఎంతో ఉంది. నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు లేవు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా కష్టపడి పని చేసి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తారనే నమ్మకం ఉంది. వారి కోసం నిరంతరం పనిచేస్తాను. ప్రతి కార్యకర్త సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తాను.
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు: 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాకు బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించినా 840 ఓట్లతో ఓడిపోయాను. 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పుడు నియోజకవర్గ ప్రజలు 34 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పించి నిధులు తీసుకొస్తున్నాను. ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయాలి. కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలతో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రజలు వారి మాటలు నమ్మొద్దు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పని చేసే పార్టీ బీఆర్ఎస్. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజల కోసం పాటుపడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తించాలి.