రామచంద్రాపురం, నవంబర్ 5: పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ కులసంఘాలు, కాలనీల అసోసియేషన్లు బీఆర్ఎస్కు ఏకగ్రీవ మద్దతు తెలుపుతున్నాయి. యువత బీఆర్ఎస్లో చేరుతున్నారు. భారతీనగర్ డివిజన్లోని బొంబాయికాలనీలో నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. బొంబాయికాలనీలో వివిధ పార్టీలకు చెందిన టిల్లు, కార్తీక్, శ్రీకాంత్, ప్రమీల బీఆర్ఎస్లో చేరారు. పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన యువత నేడు బంగారు తెలంగాణ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. బొంబాయికాలనీలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులకు ఆయన ప్రత్యేక ధన్యవాద లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, సర్కిల్ యూ త్ అధ్యక్షుడు నర్సింహ, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్ల అధ్యక్షుడు గోవింద్, బూన్, గ్రంథాల డైరెక్టర్ కుమార్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు ప్రమోద్గౌడ్, ఐలేశ్, నాయకులు అజీముద్దీన్, కుత్బుద్దీన్, సునీల్గౌడ్, గిరి, అంజయ్య, సొహైల్, జైపాల్ పాల్గొన్నారు.
పటాన్చెరు, నవంబర్ 5 : ఇంద్రేశం గ్రామంలో ఎమ్మె ల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజల్లోంచి విశేష స్పందన వచ్చింది. మండలంలోని ఇంద్రేశం గ్రామంలో సాయిబాబ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ శివకుమార్గౌడ్, అంతిరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, జనార్దన్రెడ్డి, బండి శంక ర్, కుమార్గౌడ్, శివశంకర్గౌడ్, నర్సింహరెడ్డి, వార్డు స భ్యులు దుర్గారెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
గుమ్మడిదల, నవంబర్ 5 : మండలంలోని రెండు గ్రా మాల్లో బీఆర్ఎస్ ప్రచారాన్ని భారీ ర్యాలీతో నిర్వహించారు. ఆదివారం మండలంలోని దోమడుగు, మంబాపూర్ గ్రామాల్లో మండల నాయకులు, కార్యకర్తలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని గెలిపించాలని ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్ ఎంపీపీ సద్దిప్రవీణా విజయభాస్కర్రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, విజయబాస్కర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు రాజశేఖర్, కంజర్ల శ్రీనివాస్, నాయకులు భాస్కర్రెడ్డి, మహ్మద్హుస్సేన్, మంగయ్య, వెంకటేశ్, నక్కవెంకటేశ్ పాల్గొన్నారు.
అమీన్పూర్, నవంబర్ 5: బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి మద్దతు గా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సతీమణి తుమ్మల సునీతారెడ్డి బృందావన్ కాలనీలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గూడెం మహిపాల్రెడ్డి విజయాని కి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్, పటేల్గూడ గ్రామాల్లో జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డికి ఓటు వేసి మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు క్షత్రి య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంఘం ప్రతినిధులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, ఆర్సీ పురం కార్పొరేటర్ పుష్పనగేశ్యాదవ్, సింధూ ఆదర్శ్రెడ్డి, కౌన్సిలర్లు సాధులు మల్లేశ్, బోయిని బాలమణి బాలరాజు, కొల్లూరు చంద్రకళ గోపాల్, రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యుడు యూనుస్, సీనియర్ నాయకులు శేఖర్, సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.