గుమ్మడిదల, మే 26 : అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నా రం, దోమడుగు, వీరన్నగూడెం, బొం తపల్లి, గుమ్మడిదల పట్టణాల్లో రూ.6.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మున్సిపల్ చైర్మన్ సీహెచ్. కుమార్గౌడ్, పాలకవర్గంతో సంయక్తంగా కలిసి శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్లు, యూజీడీ పనులు, రోడ్డు విస్తరణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
మిగిలిన మున్సిపల్ నిధుల టెండర్లు పూర్తి కాగానే వచ్చే నెల మొదటి వారంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దశరథ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షుడు సరెడ్డిగారి వెం కట్రాం రెడ్డి, కౌన్సిలర్లు గోకరి నిర్మాల, వరలక్ష్మి, సోని, మాధవి, పద్మా, పొన్నాల ప్రమీల, తుపాకుల రాధిక, చప్పటి పద్మ, షేక్గౌసియా, గిద్దె విజయలక్ష్మి, వరలక్ష్మి, రాజీరెడ్డి, బెంబడి సంజీవరెడ్డి, అభిశెట్టి రాజశేఖర్, మూడుచింతల నరేందర్రెడ్డి, మేడిపల్లి మురళీ, ఆర్ల కిషన్, సురభి కుమార్గౌడ్, చక్రపాణి, కత్తుల రమేశ్, బీఆర్ఎస్ సద్దివిజయభాస్కర్రెడ్డి, నాయకులు చప్పటి మహేశ్, పొన్నాల శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, మద్ది శేఖర్రెడ్డి, మహ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.