అల్లాదుర్గం, మార్చి 20: మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆలయంలో నూతన ధ్వజస్తంభ స్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిచే వేదపండితుడు ప్రవీణ్శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్ అంజియాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు బల్రాం తదితరులు పాల్గొన్నారు.