సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం మంత్రి పర్యటించారు. గొల్లగూడెం రోడ్డులోని తొమ్మిదో వార్డులో తాపీ మేస్త్రీ యూనియన్ భవన నిర్మాణానికి, రాజంపేటలో పోలీసు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాల్సాబ్ గడ్డలో బస్తీ దవాఖాన, పోతిరెడ్డిపల్లి విద్యానగర్ కాలనీలో నిర్మించిన ఈఎల్ఎస్ఆర్ నీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. మే డే రోజున మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎకరం స్థలంలో రూ. 2కోట్లతో కార్మిక భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్లలో మహిళలకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. మూడెకరాల్లో రూ8 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ను తలదన్నేలా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్టు తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గొల్లగూడెం రోడ్డులోని తొమ్మిదో వార్డులో నూతనంగా నిర్మించనున్న తాపీ మేస్త్రీ యూనియన్ భవన నిర్మాణ పనులకు మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. అసంఘటిత రంగమైన భవన కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మంత్రి వెల్లడించారు.
భవన నిర్మాణ రంగంలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకున్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను గుర్తు చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న తాపీ మేస్త్రీలతో పాటు సెంట్రింగ్ కార్మికులందరూ యూనియన్లో సభ్యత్వం తీసుకుంటే కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. క్వారీ, ఇటుక బట్టీ తదితర అన్ని రకాల కార్మికులు ఈ యూనియన్లో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. కేవలం రూ.80తో రిజిస్ర్టేషన్ చేసుకుంటే ఐదేండ్ల పాటు ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రూ.2 కోట్లతో కార్మిక భవనాన్ని ఎకరం స్థలంలో నిర్మించేందుకు మే డే రోజు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. అందుకోసం అనువైన స్థలం చూడాలని కలెక్టర్కు సూచించారు.
బస్తీ దవాఖాన ప్రారంభం
స్థానిక నాల్సాబ్ గడ్డలో బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. బస్తీ దవాఖాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
ఫంక్షన్హాల్ను బాగు చేస్తాం
పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్తో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణ ముస్లింలకు ఉపయోగంగా ఉన్న ధీన్ ధార్ఖాన్ ఫంక్షన్హాల్కు మరమ్మతు చేయాల్సిందిగా చింతా ప్రభాకర్ కోరినందున అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. షాదిఖానా బాగు చేయడంతో పాటు రంజాన్ సమీపిస్తున్నందున ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రంజాన్ను పురస్కరించుకొని విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు.
పోలీసుల సొంతింటి కల నెరవేరుద్దాం..
రాజంపేటలో పోలీసు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులకు డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించే ప్రతిపాదన ఉన్నదని మంత్రి వెల్లడించారు. అందుకోసం ప్రభుత్వమే కొంత సహాయం చేసేందుకు ముందుకుస్తుందన్నారు. ఉచితంగా స్థలం ఇచ్చి వారే సొంత ఇల్లు కట్టుకునే దిశగా ప్రయత్నాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో తక్కువ ప్రీమియంతో, ఉచిత స్థలంలో సొంతింటి కల నెరవేరుతుందనారు. అదేవిధంగా పోలీసులకు తెలంగాణ వచ్చిన తరువాత పదోన్నతులు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కొత్త డివిజన్ల ఏర్పాటుతో అనేక మంది పోలీసులకు పదోన్నతి లభించినట్లు తెలిపారు.
పోలీస్ కన్వెన్షన్ సెంటర్తో పోలీసులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. మూడెకరాల స్థలంలో రూ.8 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ను తలదన్నే విధంగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ఇప్పటికే వారికోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. అనంతరం పోతిరెడ్డిపల్లి విద్యానగర్ కాలనీలో నిర్మించిన ఈఎల్ఎస్ఆర్ నీటి ట్యాంకును మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్స న్ మంజుశ్రీజైపాల్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎస్పీ రమణ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జడ్పీటీసీ సునీతామనోహర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, బీరయ్య యాదవ్, తాపీ మేస్త్రీ యూనియన్ అధ్యక్షుడు కోటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాల ప్రారంభం
కొండాపూర్, ఏప్రిల్ 11: మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో నెలకొల్పిన సంయుక్త ప్రైవేట్ పాఠశాలను మంగళవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతా సాయినాథ్, మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సొసైటీ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, నాయకులు మల్లాగౌడ్, ప్రభాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.