తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా చూస్తూ పరిపాలన సాగిస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలంలోని జగ్గంపేట, గంగారం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్, శీలాంపల్లి, గిరిజన తండా, కొల్చారం మండలంలోని కిష్టాపూర్, రాంపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాంపూర్లో పెద్దమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిష్టాపూర్లో సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో ఎదురేగి, పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.
చిలిపిచెడ్, నవంబర్ 13: తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా చూస్తూ పరిపాలన సాగిస్తున్నాడని, బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి,బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చిలిపిచెడ్ మండలంలోని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి జగ్గంపేట గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చిలిపిచెడ్ మండలంలోని జగ్గంపేట, గంగారం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్, శీలాంపల్లి, గిరిజన తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగారం, అజ్జమర్రి, గిరిజన తండాలు, ఫైజాబాద్ తదితర గ్రామాల్లో వారికి ప్రజలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండ్ బాజా, డప్పుచప్పుళ్లులతో ఆటపాటలు,బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నినాదాలు,ర్యాలీల మధ్య ఎమ్మెల్యే, అభ్యర్థి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అన్న మదన్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు.
బీఆర్ఎస్ నిరుపేదలకు భూములు పంచి పెట్టె ప్రభుత్వం, గుంజుకునే ప్రభుత్వం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి పూర్తి హక్కులు కల్పింస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలా కరెంట్ గోస పడాల్సిందేనని, ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో లేదా రాబంధులకు వేస్తారో ఆలోచింయాలన్నారు. చిలిపిచెడ్ మండలంలో ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొదని, కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు.52 కిలో మీటర్లు ప్రవహించే మంజీరా నదిలో 14 చెక్డ్యాంలు నిర్మించిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు. చిలిపిచెడ్ మండలంలో మంజీరా నదిలో అజ్జమర్రి,ఫైజాబాద్, చండూ ర్, చిట్కుల్ గ్రామ శివారులో చెక్డ్యాంలు నిర్మించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాంచెంద్రారెడ్డి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు మీన్నాప్రసన్నరెడ్డి,బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్,జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు సయ్య ద్ హుస్సేన్, మండల కో ఆప్షన్ సభ్యుడు షఫీయొద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు మాంత ప్ప, మమతాబాబు, పరశురాంరెడ్డి, ఇస్తారి, నర్సింహారెడ్డి, కవితా ముకుందరెడ్డి, గోపాల్రెడ్డి, యాదగరి, శంకర్నాయక్, ఎంపీటీసీలు మల్లయ్య, మల్లమ్మ సంగాగౌడ్, నాయకులు మధుసూదన్రెడ్డి, మా ణ్యికరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, జయరాంరెడ్డి, అనంతరామాగౌడ్,రాజేందర్రెడ్డి, యాదాగౌడ్, వీరాస్వామి, మధుసూదన్గౌడ్ పాల్గొన్నారు.