వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని, 10 హెచ్పీ మోటర్లతో మూడు గంటల్లో మూడెకరాలు పారుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టాల్సి వస్తే భూములన్నీ బీళ్లుగా మారడం ఖాయమని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24గంటల కరెంటు సరఫరా చేయడంతో సంతోషంగా రెండు పంటలు సాగు చేస్తుంటే, కొందరి కన్నుగిట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమిస్తే కరెంటు కష్టాలతో పాటు రైతు ఆత్మహత్యలు తప్పవని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
మెదక్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేయడంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. రైతులు దర్జాగా 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. యాసంగి, వానకాలం పంటలు పండించుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ నేతలు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్నారు. 10 హెచ్పీ మోటర్లతో మూడు గంటల్లో మూడెకరాలు పారుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టాల్సి వస్తే భూములన్నీ బీళ్లుగా మారడం ఖాయమని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం రైతులు బోరు, బావులకు 5 హెచ్పీ మోటర్లకు బదులు 10 హెచ్పీ మోటర్లను వాడితే ఇటు రైతులు, అటు ప్రభుత్వానికి రెట్టింపు భారం పడనున్నది. రైతులు 5 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలంటేనే నానా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు 10 హెచ్పీ మోటర్లను విక్రయించాలంటే రూ.లక్ష వరకు అదనపు భారం పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని కూడా పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్ల స్థాయితో 10 హెచ్పీ మోటర్లు నడిపిస్తే అవి కాలిపోయే పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం రైతులు 25 కేవీఏ బుడ్డీల స్థానంలో 65 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను పెట్టాల్సి వస్తుంది.
మెదక్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ 5 హెచ్పీ మోటర్లే మేలంటున్నారు రైతులు. 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లతో బోర్లలోని నీటిని మామూలుగా తోడుకోవచ్చు. అదే 10 హెచ్పీ మోటర్లు వినియోగిస్తే బోర్లలో నీటి నిల్వలు తగ్గిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోర్లకు 5 హెచ్పీ మోటర్లే సరిపోతాయాని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమిస్తే కరెంటు కష్టాలతోపాటు రైతు ఆత్మహత్యలు తప్పవని జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
10హెచ్పీ మోటర్లతో 3 గంటల్లో మూడు ఎకరాలకు నీళ్లు పారించవచ్చని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 10హెచ్పీ మోటర్లు వద్దే వద్దు.. తెలంగాణ రాష్ట్రం సరఫరా చేస్తున్న 24 గంటల కరెంటే చాలు అని రైతులు చెబుతున్నారు. 10 హెచ్పీ మోటర్లు పెడితే ఇప్పుడు రెండు పంటలకు సరఫరా అవుతున్న నీరు రేపు ఒక్క పంటకు కూడా సరిపోదని పేర్కొంటున్నారు. బోర్లల్లోని నీటిని రెండు రోజుల్లో తోడేస్తే ఆరు నెలల దాకా ఎట్లా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడుతున్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు అంధకారమేనని భయపడుతున్నారు.
ధరణి వచ్చినందుకే మండలంలోనే సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మెదక్ పోయి బ్యాంకులో చలాను తీసుకోవాల్సి వచ్చేది. అది రాకపోతే తిరిగి ఇంటికొచ్చెటోళ్లం. ఇట్లా మస్తు ఇబ్బందులు పడ్డం. ధరణి వచ్చినంక మండలంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వచ్చి ధరణి తీసేస్తే మళ్లీ అదే గతి పడ్తది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కరెంటు విషయంలో మాట్లాడిన మాటలు రైతాంగాన్ని గందరగోళంలో పడేసేలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. ధాన్యం మెండుగా పండి రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్రెడ్డి ప్రకటనలతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 5హెచ్పీ మోటర్ల స్థానంలో 10హెచ్పీ మోటర్లు బిగించడానికి వేలాది రూపాయలు ఖర్చవుతుంది. ఇది అదనపు భారం కదా.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాత్రిపూట సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ సరఫరా అయ్యేది. దాంతో బోరు మోటర్ల వద్ద పడికాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి సమస్యలు లేకుండా పోయాయి. ఇప్పుడు 3 గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల బతుకులు ఆగమవుతాయని స్పష్టంగా తెలుస్తున్నది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సమస్యలు లేకుండా రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారు.
నాకు నాలుగెకరాల భూమి ఉంది. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటిస్తే ఎవుసం ఎట్లయితది. 24 గంటలుంటే ఎప్పుడంటే గప్పుడు పోయి మోటర్ ఏసుకుని నీళ్లు పారబెడుతం. అంతే గాని గెలువక ముందే కాంగ్రెసాయన రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ ఇస్తానంటడు. ఇగ గెలిచినంకా ఇంకా ఏముందో.. గంట ఇస్తడో లేదో కూడా తెల్వది.
రైతు బాగు పడడం కాంగ్రెస్కు ఇష్టం ఉండదు. మూడు గంటల కరెంట్తో మా పొలాలు సాగు కావు. కాంగ్రెస్ చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో రైతులు బాగుపడరు. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడంతో 5హెచ్పీ మోటర్లను వాడుతున్నం. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్పీ మోటర్లను పెట్టిస్తమని చెబుతున్నరు. రైతులందరం ఒకేసారి 10 హెచ్పీ మోటర్లు స్టాట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. రైతులతో పాటు ఇండ్లలో కూడా కరెంట్ కష్టాలు మొదలవుతాయి. గీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నది. పంటలు మంచిగ పండుతున్నయ్. మళ్లీ కాంగ్రెసోళ్లు వస్తే మాబతుకులు ఆగం చేస్తరు. పదేండ్ల కాలంలో రైతులమంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నం.
కాంగ్రెసోళ్లవి దగాకోరు, ఝూటా మాటలు. ఎైైట్లెనాసరే ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తమని అబద్ధపు మాటలు జెప్పి ఓట్ల కోసం పేదోళ్లను పిచ్చోళ్లను చేసెతందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. గాల్ల కుట్రలు ఎప్పుడూ కూడ పని-జేయవ్. మా ఓటు మా ఇష్టం మేము గాల్ల మాటలు విని ఓటేస్తే మాకు చిప్పగతే పడుతది. వాల్లంత దొంగలు ఇంకేవలు లేరు. వాళ్ల దొంగ మాటలకు ఇక్కడ వినెటొళ్లు కూడా ఎవ్వలు లేరు. ముందుగల్ల వాళ్లు గెలువని అటెనుక సీఎం కుర్చీకోసం కొట్టాడుండ్రి. అసలు ఇంక ఓట్లే గాలేదు.. గిప్పుడే వాల్ల కుర్చిల కొట్లాట. రేపు వాల్లగనుక గెలుస్తే తెలంగాణను మొత్తం అమ్ముకుంటరు. ఇది మాత్రం పక్కా. ప్రజలారా వాల్ల మాటలను నమ్మకుండ్రి. మల్ల మన కేసీఆర్సార్నే గెలిపించుకోవాలే. కేసీఆర్ సార్ ఉంటేనే మనకు బతుకులు బాగుపడుతయ్.
పది అస్పర్ల మోటర్లు బిగిస్తామని కాంగ్రెసోళ్లు చెబుతుండ్రు గాని పదస్ప ర్లతో మాకు ఉపాధి ఉండ దు. మోటర్లు కాలిపోతే హైదరాబాద్కు తీసుకుపో యి రిపేర్ చేపించుకోవాలే. రైతు బోరువేయంగనే ముందుగా మమ్మల్ని (మెకానిక్లే) అడుగతారు. ఈ బోరులో ఏ మోటర్ వేస్తే నడుస్తదని వాల్లన్నట్లు వాల్ల మాటలు నమ్మి ఎవ్వరు కూడా పది అస్పర్ల మోటార్లను తెచ్చుకోరు. ప్రజలంత పిచ్చోళ్లుగారు. కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోను రానియరు. గిప్పుడు గూడా కేసీఆర్ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతరు.
కాంగ్రెసోళ్లు ఎప్పటికీ గూడ రాజకీయానికి పనికి రారు. యాభై ఏండ్ల సంది లేంది ఇప్పుడు మేము పది అస్పర్ల మోటార్లను పెడ్తమంటే నమ్ముతరా. గాలిమాటలు. వీల్లకుగిట్ల తెలంగాణను అప్పజెప్పితే మూ డు రోజుల్లోనే రాష్ర్టాన్ని మింగేస్తరు. వైండింగ్ పను లు చేసే మాకు ఇప్పటికే పనులు లేక ఇబ్బంది పడుతున్నం. పది అస్పర్ల మోటర్లు పెడ్తమంటుండ్రు. అసలు వీళ్ల మాటలు ఎవరైనా వింటేగదా. ఎవుసం జేసెటోళ్లకు తెలుసు. వాళ్ల బోర్ల నుంచి వచ్చే నీళ్ల మీదికెల్లి మోటర్లను బిగిస్తరు. ఎవుసం తెలియని ఈ కాంగ్రెసొల్లకేం తెలుస్తది.
భూస్వాములు తప్ప రైతులెవ్వరూ 10 హెచ్పీ మోటర్లు వాడరు. ఐదు నుంచి పదెకరాలు వరకు రైతులు కూడా 3హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు వాడుతం. సామాన్య రైతులు 10 హెచ్పీ మోటర్లు ఎందుకు వాడుతరు. వ్యవసాయ బావులకు 10 హెచ్పీ మోటర్లు ఏ రైతు కూడా ఉపయోగించరు. ఈ 10 హెచ్పీ కరెంట్కు వేసిన పంటలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బోర్బావిలో నీరు త్వరగా ఖాళీ అయిపోయి, మోటర్ మీద భారం పడుతది. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నా పొలానికి రెండు, మూడు రోజులకోసారి నీరు పారిస్తా.. నేను పొలానికెళ్లి నీరు పెడతా.. 5హెచ్పీ మోటర్ ఉన్నది. దీంతో పంటకు సరిపడా నీరందుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయాలు చేస్తున్నరు. 24 గంటల నిరంతరం విద్యుత్ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికే అండగా ఉంటాం.
కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తమని గొప్పలు చెబుతుండ్రు. వాల్లంటున్న మూడు గంటలతోని మూడు గుంటలు గూడ పారదు.ఎవుసం చేసెటోళ్లం మాకు తెల్వదా.. కరెంట్ ఎంతస్తే ఎంత పొలం పారతదో. ఎవుసం జేసెటోనికి అంత తెలుసు. కాంగ్రెసొళ్లు అన్నట్లు ఏం గాదు. యాబై ఏండ్లు పరిపాలించిండ్రు ఎవుసం గురించి తెల్వదు. వీళ్లు రేపొద్దుగల్ల తెలంగాణను నడిపిస్తరా. ఈ కాంగ్రెసొళ్లను నమ్ముకుంటిమంటే మాకు ఎవుసంలో ఏం మిగలదు. మంచి జేసేటోల్లను ఇడిసిపెట్టి గిటువంటి దొంగలకు అప్పజెబుతమా. మాకు గూడ రాజకీయాలు తెలుసు. వాల్లన్నంత మాత్రంల వాల్లకేం ఓట్లు పడయి. మల్ల ఎైట్లెనా కేసీఆర్ సార్ వస్తడు. గిది పక్కా.
సీఎం కేసీఆర్ రైతులు మంచిగా ఉండాలని 24 గంటల పాటు కరెంట్ ఇస్తుండు.10 ఏండ్ల కింద కరెంట్తో మస్తు కష్టాలు పడ్డాం. పంటకు నీళ్లు పెట్టాలని కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా పొలల కాడా పండుకున్న దినాలు చాలానే ఉన్నాయి. సీఎం కేసీఆర్ అందిస్తున్న 24 గంటల కరెంట్ వల్ల నాకు వీలైనప్పుడు పొలం వెళ్లి పావుఎరకం చూసుకొని ఇంత పొద్దు ఉండగానే ఇంటికి చెరుతున్నా. సీఎం కేసీఆర్ మా రైతులకు అన్ని విధాలుగా అక్కరకస్తుండు. కానీ గీ కాంగ్రెసోల్లు 3 గంటల కరెంట్ అయితే పొలానికి సరిపోతుందని ఏతులు మాట్లాడుతుర్రు. ఈ కాంగ్రెస్ గీట్ల అధికారంలోకి వస్తే రైతులమంతా ఆగమైతం. రైతుల కోసం కష్టపడుతున్న సీఎం కేసీఆర్నే మళ్లి గెలుపించుకుంటాం.
ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో ఎంతో మేలు చేకూరుతున్నది. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇస్తే రైతులు చాలా నష్ట పోతారు. గత ప్రభుత్వాల హయాంలో 7 గంటల కరెంటు సరఫరాలో ట్రిప్పులు చేసి రాత్రి పగలు పొలాల చుట్టూ కాపాలా కాసేవాళ్లం.ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
10 హెచ్పీ మోటర్ వేసుకుంటే దానికి తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్రెడ్డి కొనిస్తాడా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తున్న 24 గంటల కరెంట్తో వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం. గీ ఎన్నికల కోసం 10 హెచ్పీ మోటర్లు, మూడు గంటల కరెంట్ అని రైతులకు వ్యతిరేకంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద నాలుగు నుంచి ఐదు మోటర్లతో వ్యవసాయం చేసుకుంటున్నాం. గిప్పుడు కాంగ్రెసోళ్లు అన్నట్లు 10హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే ఇద్దరు రైతులు రెండు మోటార్లు పెట్టుకుంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. మిగితా ముగ్గురి పొలాలకు నీళ్లు ఎట్లా.. ఎక్కువ లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మళ్లీ మళ్లీ కొనుక్కోవాలా.. రైతులు ఎప్పటి నుంచో మూడు, ఐదు హెచ్పీ మోటర్లనే వాడుతున్నరు. ఇప్పడు లేనిపోని మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నరు.
గిప్పుడు గిప్పుడే సీఎం కేసీఆర్ చలువతో కొంచెం బాగుపడుతున్నాం. రైతులు బాగు పడటం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు. రైతు బంధు పథకంతో సెట్ల దగ్గరికి అప్పలు తెచ్చుకునే పరిస్థితి పోయింది. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పైసలను పంటల సాగు ఖర్చులకు వాడుకుంటున్నా. గడిచిన ఈ పదేండ్లలో కరెంట్ కష్టాలు లేకుండా చేసిండు మా సీఎం కేసీఆర్ సార్. రైతులకు కరెంట్తోనే ఏ కష్టం లేకుండా చూసుకుంటుండు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. 24 గంటల కరెంట్తో మంచిగా పంటలు పండిస్తూ ఆనందంగా ఉంటున్నాం.
మూడు గంటల కరెంటు వస్తే గోస పడతాం.. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పంటలకు పగలే నీరు పెడుతున్నాం. మూడు గంటల కరెంటు ఇస్తే ఎకరం పొలంలో 2 గుంటలు కూడా నీళ్లు పారదు. ప్రభుత్వం కరెంటు 24 గంటలు ఇవ్వడంతో దిగుబడి కూడా అధికంగా వస్తుంది.
10 హెచ్పీ మోటార్లతో రైతులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. 10 హెచ్పీ మోటారు పెట్టడం వల్ల బోరు బావిలో ఉన్న నీళ్లు ఖాళీ కావడంతో పాటు ఇతర బోరు బావులకు ఉన్న ఊటల ద్వారా ఆరైతు బోరు బావిలోని నీరు కూడా ఖాళీ అవుతుంది. దీంతో ఒక రైతు వల్ల మరో ఇద్దరు రైతులు నష్టం చెందుతారు.
10 హెచ్పీ మోటార్లు మన దగ్గర వ్యవసాయానికి నడవవు. 10 హెచ్పీ మోటార్లు పెడితే బోరు బావిలోని గ్రౌండ్ వాటర్ త్వరగా ఖాళీ అవుతుంది. మన దగ్గర 5 హెచ్పీ మోటార్లు మాత్రమే వాడతాం. 10 హెచ్పీ మోటార్లు చాలా ఖర్చుతో కూడుకున్న పని.
కాంగ్రెస్ లీడర్ రేవంత్రెడ్డి అన్నట్టూ పొలాల కాడా 10 హెచ్పీ మోటర్లతో ఎవుసం చేసుడు కాని పని. ఎందుకంటే ఆమోటర్ గనుక పిడ్ చేస్తే ఒక్కసారే బోరు నుంచి నీళ్లను తీసుకొచ్చి తర్వాత చుక్క నీరు రాదు. మళ్లా ఆ మోటర్ నడువలంటే ఎక్కువ కరెంట్ కావాలి. ఈ కారణంగా సరిగ్గా కరెంట్ సరిపోకా ఇటు మోటర్లు అటు ట్రాన్ఫార్మర్లు కాలిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎవుసం చేస్తే రైతుల బాధాలు తెలుస్తుండే. ఏసీ రూమ్ల్లో కూసోని రైతులు బాధపడే విధంగా మాట్లాడుతుర్రు ఈ కాంగ్రెసోళ్లు.
మాకు ఇప్పుడు కేసీఆర్ సార్ ఇస్తున్న 24గంటల కరెంటే గావాలే. కాంగ్రెసోళ్లు అన్నట్లు మూడు గంటల కరెంట్ ఇస్తే మా బోర్లు నడవయి. మా ఎవుసం గూడా మల్ల పెద్దలు జేసినప్పటి కాలం లెక్క అయితది. మేము అస్సలు కాంగ్రెస్ వాల్ల మాటలు నమ్మము. వాల్ల మాటలు పట్టుకుని మంచి ముఖ్యమంత్రిని పొగొట్టుకుంటమా. వాల్లన్నంత ఈజీగా మేము లేము. మాకు రైతులకు అన్ని రైతుబంధు, రైతు బీమా, మా బిడ్డలకు కల్యాణలక్ష్మి, మాకు పింఛన్లను ఇస్తున్న కేసీఆర్ సార్నే మేము కోరుకుంటం. మల్లగూడా ఆ సార్ను గెలిపించి తీరుతం. మా పిల్లలు గప్పట్లో సదువుకోవాలంటే ఎంతో దూరం పోయేది. గిప్పుడు మా ఊర్లలలోనే ఇస్కుల్లు పెట్టిండు. మంచి సన్నబియ్యంతో అన్నం పెడ్తుండు. మాకింక ఎవరితో పనిలేదు. మాకు కేసీఆర్ సారే గావాలే. ఈ కాంగ్రెస్ నమ్మక ద్రోహుల మాటలు అస్సలు వినం.