రామాయంపేట, జనవరి 23: స్థానిక సంస్థల పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రామాయంపేట రెవెన్యు డివిజన్ సాధన సమితి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు తీర్మానాలతో ఆరోగ్య ఆర్థిక శా ఖల మంత్రి తన్నీరు హరీశ్రావు క్యాంపు కార్యాలయం వద్ద కు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వెళ్లారు.
నియోజకవర్గ పరిధిలో ని రామాయంపేట మండలంతో పాటు చుట్టూరా నాలుగు మండలాలు, రామాయంపేట మున్సిపాలిటీ అతిపెద్దగా విస్తరించి ఉందని అందుకోసం మెదక్ జిల్లా రామాయంపేట ప్రజలకు రెవెన్యూ డివిజన్ ఇప్పించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి రెవెన్యు డివిజన్ విషయమై సీఎం కేసీఆర్సార్తో మాట్లాడుతానని హామీ ఇచ్చారని తెలిపారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం తన మద్దతు కూడా ఉంటుందని అఖిలపక్ష క మిటీ సభ్యులకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలలను, డివిజన్లను, పంచాయతీలను ఏర్పాటు చే సిందన్నారు. మంత్రి హరీశ్రావు రెవెన్యు డివిజన్పై సానుకూలంగా స్పందించడంతో డివిజన్ సాధన సమితి సంతోషం వ్యక్తం చేసింది.
కార్యక్రమంలో రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చం ద్రం, బీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, కొండల్రెడ్డి, దేవుని రాజు, డివిజన్ సాధన సమిటీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, రమేశ్రెడ్డి, చింతల యాదగిరి, పోచమ్మల శ్రీనివాస్, కుమా ర్, దామోదర్చారి ఉన్నారు.