మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 9 : మెదక్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 11 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 79 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణాలు సుందరంగా మారుతున్నాయన్నారు. ప్రతి మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెలా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. పట్టణంలో ఇప్పటికే విశాలమైన మెయిన్ రోడ్డు వేసుకున్నామని సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడలిలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
అంతేగాకుండా పట్టణంలోని అంతర్గ రోడ్లతోపాటు ఆయా వార్డులలో కాలానీలు, వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నమన్నారు. పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచాలని పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూధన్రావు, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, ఆవారి శేఖర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.