Murder | కంగ్టి, ఫిబ్రవరి 20 : భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికిచంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కంగ్టి ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కవడగామ గ్రామానికి చెందిన చంద్రమ్మ (45) కూలి పనిచేసి కాలం వెల్లదీస్తుంది. బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మతో గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య చంద్రమ్మను అతికిరాతకంగా నరికి చంపాడు.
ఈ విషయం గురువారం తెల్లవారుజామున ఇరుగుపొరుగువారికి తెలియడంతో వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకున్నారు. గతకొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య తరుచుగొడవలు జరిగేవని గ్రామస్తులు తెలుపుతున్నారు. చంద్రమ్మ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నారాయణఖేడ దవాఖానకు తరిలించారు. గుండప్పపై కేసునమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.