మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన మెదక్ మండలం తిమ్మానగర్లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మానగర్ గ్రామానికి చెందిన నర్సింలు, కుమారుడు రవి, భార్య మంగమ్మ(35) నిత్యంలాగే వారి పూరిగుడిసెలో నిద్రిస్తున్న సమయంలో షాక్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంగమ్మ మంటల్లోనే సజీవదహనం కాగా, నర్సింలు, రవిలు గాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డారు.
గాయాలపాలైన తండ్రీకొడుకులను చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించినట్లు మెదక్రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ సైదులు పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.