నిజాంపేట, మార్చి 20: వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మండలంలోని జడ్చెరువు, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఇటీవల నిజాంపేటలో విద్యుత్ షాక్తో మృతిచెందిన బక్కొల్ల మల్లయ్య కుటుంబీలను ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు నసీరొద్దీన్, మారుతి, ముత్యంరెడ్డి, వెంకటేశ్ గౌడ్, మధుసూదన్రెడ్డి, రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, లక్ష్మణ్, మసూద్, మహేశ్, రాజయ్య, శ్రీకాంత్, భూమగౌడ్, బాలయ్య, నరేందర్, బాబు తదితరులు ఉన్నారు.