మనూరు, ఫిబ్రవరి 29: అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలతో కాంగ్రెస్ ఆడుకుంటున్నదని కామా రెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో బీజేపీ విజ య సంకల్ప యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ నిరుపేదలకు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పథకాలతో కొందరికి మాత్రమే లాభం చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నారే తప్ప పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పాలించిన పార్టీలు కనీసం ఈ ప్రాంతంలో డబుల్ రోడ్డు వేయలేక పోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. అనంతరం మనూరు నుంచి నారాయణఖేడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్రెడ్డి, సంగప్ప, విజయ్పాల్రెడ్డి, అంబర్సింగ్, రజినీకాంత్, ఈశ్వరప్ప, రామకృష్ణ, అంజయ్య, వినయ్కుమార్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్, ఫిబ్రవరి 29: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే అప్పుల భారం మరింత పెరుగుతుందని, తెచ్చిన అప్పు పథకాలకే సరిపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని బీజేపీ నేత, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం నారాయణఖేడ్లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజీవ్చౌక్ వద్ద రోడ్షోలో ప్రసంగించారు. ఆరు గ్యారెంటీల అమలుకు రూ.2 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని, అప్పులను ఎత్తిచూపుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీల పేరిట కొందరికి లాభం చేకూర్చేందుకు అందరిపై భారం మోపుతున్నారన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్రెడ్డి, బీజేపీ నేతలు ఆలే భాస్కర్, జైపాల్రెడ్డి, సంగప్ప, పైడి ఎల్లారెడ్డి, సుభాష్రెడ్డి, రజినీకాంత్, సాయిరాం, రాజుగౌడ్ పాల్గొన్నారు.