చిలిపిచెడ్/కొల్చారం/రామాయంపేట/రేగోడ్/నిజాంపేట, ఫిబ్రవరి 4 : గంజాయి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ అధికారి రజాక్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంపేట పోలీస్స్టేషన్లో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ‘గంజాయి రహిత గ్రామాలు’ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం వ్యవసాయశాఖకు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ జయసుధ,స్థానిక ఎస్సై ప్రకాశ్గౌడ్, ఏవో సతీశ్,ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్లు చంద్రవర్థిని, అమరసేనారెడ్డి, గేమ్సింగ్,అరుణ్ కుమార్, ఎంపీటీసీలు లహరి, బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు యాదగిరి, రవి, నాగరాజు, వెంకటేశం, లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. రేగోడ్ పోలీస్ స్టేషన్లో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై శుక్రవారం సీఐ జార్జ్, ఎస్సై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి గ్రామం గంజాయి రహితంగా మారాలని సూచించారు. గంజాయి, ఎవరైనా అమ్మినా, తాగినా పంటచేలల్లో వనాలు పెంచినా జరిమానాలు, కేసులు నమోదు చేస్తామని రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ, ఎస్సై రాజేశ్ అన్నా రు. రామాయంపేట పోలీస్స్టేషన్ ఎదుట సర్పంచ్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో గంజాయి రహిత గ్రామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్గౌడ్ మెదక్ రూరల్ సీఐ విజయ్,ఎక్సైజ్ సీఐ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. చిలిపిచెడ్ పోలీస్స్టేషన్ ఆవరణలో మం డల ప్రజాప్రతినిధులతో సీఐ షేక్లాల్ మథార్,ఎస్సై రమేశ్ సమావేశం ఏర్పాటు చేశారు.ఎవరైనా గంజాయిని సాగుచేస్తే,గుట్కాలు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు సహకరించాలని తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ సూచించారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్లో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సర్పం చ్లు, వీఆర్ఏల కు అవగాహన సదస్సు నిర్వహిం చారు. సమావేశంలో తూప్రాన్ సీఐ శ్రీధర్, ఎస్సై మహేందర్ ఉన్నారు.