పుల్కల్, జూన్ 5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ తెలిపారు. గేట్ ద్వారా 3472 క్యూసెక్యులు, పవర్హౌస్ ద్వారా మిగిలిన నీరు దిగువకు వదులుతున్నారు.
. నీటి విడుదల చేసినందున మంజీరా నది పరీవాహకం వైపు ప్రజలు, మత్స్యకారులు, గొర్రెలు, మేకలు, పశుపెంపకందారులు వెళ్లవద్దని సూచించారు.