పెద్ద శంకరం పేట్ : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.
పెద్ద శంకరం పేట్ దానం పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వార్డు సభ్యులు పలంచ రమేష్, పుట్ల నాగరాణి, అర్జన్ బాలకృష్ణమ్మ ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనన్న, వైస్ ఎంపీపీ లక్ష్మి,సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.