రామాయంపేట/ నిజాంపేట/ చిలిపిచెడ్/ శివ్వంపేట, డిసెంబర్ 4 : ఓటరు జాబితాలో అనర్హులను తొలిగిస్తూ కొత్త ఓటర్లను చేర్చుకోవాలని, ఓటు హక్కు ఉన్నవారు స్థానికంగా లేకుంటే నోటీసు ఇచ్చి, పేర్లను తొలిగించాలని బూత్ లెవల్ అధికారులకు రామాయంపేట తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశించారు. ఆదివారం రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని కోనాపూర్, అక్కన్నపేట గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించి, బూత్ లెవల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో ప్రజల చేతి లో ఉన్న వజ్రాయుధమన్నారు. సమాజ నిర్మాణానికి ఓటే కీల కమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరును నమో దు చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజు, బీఎల్వోలు జమున, రాధ, రాణి, జూనియర్ అసిస్టెంట్లు శివరాజు, ఇమ్మానియెల్ పాల్గొన్నారు.
18 ఏండ్లు నిండిన యువత ఓటర్లుగా మారాలని బీఎల్వో అంజయ్య అన్నారు. నిజాంపేట మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు కోసం ఫారం-6ను పూర్తి చేసి, బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేదా చిరునామాలో తప్పులు ఉంటే సరి చేసుకోవాలని వివరించారు. చిలిపిచెడ్ మండలంలో ఓటరు నమోదు నిర్వహించారు.18 ఏండ్లు నిం డిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఆదర్శ్కుమార్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమన్నారు. ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో కూడా దరఖాస్తే చేసుకోవచ్చని తహసీల్దార్ సూచించారు.
అర్హులందరూ ఓటరుగా పేరును నమోదు చేసుకోవాలని నర్సాపూర్ ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం అన్నారు. శివ్వంపేట మండలంలోని చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల గ్రామాల్లోని ఓట రు నమోదు కేంద్రాలను ఆర్ఐ కిషన్తో కలిసి సందర్శించారు. బూత్స్థాయి అధికారులతో మాట్లాడి ఓటరు నమోదు వివరా లను అడిగి తెలుసుకున్నారు. మార్పులుచేర్పులు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట బీఎల్వోలు ఉన్నారు.