టేక్మాల్, అక్టోబర్ 25 : మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజిపల్లి, తంపూలూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పరిపాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజల జీవన విధానం మారిందన్నారు. నాడు పేదరికంలో మగ్గిన ప్రజలు నేడు సంపదను సృష్టించే స్థాయికి ఎదిగారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు చేరాయని తెలి పారు. గత ప్రభుత్వాలు చేయని అనేక పనులను, అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి, చూపించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని వివరించారు.
వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటలపాటు నాణ్య మైన కరెంట్ ఇచ్చామన్నారు. పరిశ్రమలకు కరెంట్ కొతలు లేకుండా ఇవ్వడంతో కార్మికులకు చేతినిండా పని లభిస్తుందని తెలిపారు. ఎన్నికల తేదీలను ప్రకటించినా ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించలేదని విమర్శిం చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలను సాధ్యం కానీ హామీలుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. గతంలో వారు అధికారంలో ఉండి పేదలకు రూపాయి సాయం అంద లేదని విమర్శించారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేస్తా రన్నారు. రైతే రాజు అని నమ్మిన పాలకుడు కేవలం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడ్డ బాధలు వర్ణనాతీతమన్నారు. తెలంగాణలో నేడు రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ధాన్యం కొనుగోలు, పండుగ కానుకలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఇస్తున్న ఆర్థికసాయాన్ని పెంచుతామన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా అమలు చేస్తామని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్, రాష్ట్ర నాయకుడు జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్య దర్శి అవినాశ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.