మెదక్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : మట్టి, ఇసుక, ఇటుక అక్రమ రవాణాపై గనులు, భూగర్భ శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. శనివారం మెదక్ పట్టణంలో దాడులు నిర్వహించి మట్టి, ఇటుకలు తరలిస్తున్న టిప్పర్లను స్వాధీనం చేసుకుని రూ.1.24,450 జరిమానా వసూలు చేసినట్లు మైనింగ్ శాఖ ఏడీ జయరాజ్ తెలిపారు.
అనుమతులు లేకుండా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు సీజ్ చేస్తామని ఆయన పేరొన్నారు. గత నెల 29వ తేదీన జిల్లాలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించిన మైనింగ్ అధికారులు రూ.1.52 లక్షల జరిమానాలు విధించారు. అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు ఏడీ జయరాజ్ తెలిపారు.