థింపూ: భూటాన్ యాంటీ స్మార్ట్ సిటీ ఇప్పుడు ప్రపంచంలోని పలువురు పర్యాటకులను ఆకర్షిస్తున్నది. సాధారణంగా స్మార్ట్ సిటీ అంటే ఆకాశహర్మ్యాలు, ఆధునిక సౌకర్యాలతో అలరారుతుంది. గెలెపు మైండ్ఫుల్నెస్ సిటీ అని పేరు పెట్టిన ఈ నగరం దానికి విరుద్ధం. ఇక్కడ ఆకాశాన్నంటే భవనాలు కాదు.. కనీసం అక్కడ ఉన్న చెట్లకన్నా ఎత్తయిన భవనాలు కూడా కన్పించవు. ఏ భవనం కూడా అక్కడ ఉన్న చెట్లను మించి ఎత్తు ఉండరాదని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిని ప్రపంచంలోనే తొలి యాంటీ స్మార్ట్ సిటీగా అభివర్ణిస్తున్నారు.
భారత్లోని అస్సాం సరిహద్దుకు సమీపంలోనే ఈ నగరం ఉంది. భారతీయులు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండా 24 గంటల పాటు ఈ నగరాన్ని ఉచితంగా సందర్శించవచ్చు. చుట్టుపక్కలున్న అడవులు తగ్గిపోకుండా నగరాన్ని రూపొందిస్తున్నారు. ఇక్కడ ప్రకృతికి, పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి వ్యాపారాలు ఇక్కడ నిర్వహించరు. కేవలం పర్యావరణ హిత వ్యాపారాలు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు.