రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ బదిలీలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి నియమితులయ్యారు. ఆమె త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బదిలీ కాగా, ఆమె స్థానంలో 2018 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన బాలస్వామిని ప్రభుత్వం మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించింది. ఆయన హైదరాబాద్లో సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తూ మెదక్కు వస్తున్నారు. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో కామారెడ్డి ఎస్పీ సింధూ మెదక్ ఇన్చార్జి ఎస్పీగా కొనసాగుతున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్గా బి.అనురాధ నియమితులయ్యారు. ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్స్లో డిప్యూటీ కమిషనర్గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. బదిలీపై సిద్దిపేట పోలీస్ కమిషనర్గా ఆమె వస్తున్నారు.
సంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ బదిలీ అయ్యారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా శరత్ను బదిలీ చేసింది. సంగారెడ్డ్లి కొత్త కలెక్టర్గా వల్లూరు క్రాంతి నియమితులయ్యా రు. గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న క్రాంతిని సంగారెడ్డి కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. శరత్ను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించింది. శరత్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా 18 జూన్, 2022న బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్గా ఏడాదిన్నర పనిచేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించారు. జిల్లాలో పర్యటిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా చూశా రు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాలు మెరుగయ్యేలా చూశారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకున్నారు. మునిపల్లి మండలంలో ఫుడ్ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కలెక్టర్ శరత్ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు.
సంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టర్గా వల్లూరు క్రాంతి నియామకమయ్యారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన క్రాంతి మహబూబ్నగర్ జిల్లా డీఆర్డీవోగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. సెప్టెంబర్ 2021న జోగులాంబ గద్వాల కలెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం జోగులాం బ గద్వాల కలెక్టర్గా ఉన్న క్రాంతిని ప్రభు త్వం సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన క్రాంతి హైదరాబాద్, ఐఐటీ ఢిల్లీల్లో చదువుకున్నారు. 2016లో ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో 65వ ర్యాంకు సాధించింది. 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి క్రాంతి నిర్మల్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లా ల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయిన వల్లూరు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.