అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో ప్రజారోగ్య రక్షణ
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
36వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
సిద్దిపేట, జూన్ 26 : సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నామని, అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నాం’అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వందేండ్లకు పునాది’ ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు యూజీడీ నిర్మాణం చేపట్టామన్నారు. యూజీడీ నిర్మాణంలో ఈగలు, దోమలు ఉండవని, మురుగు నీటిని శుద్ధి చేసి చెరువులోకి పంపిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రాంతానికి సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చామన్నారు. పదేండ్ల కింద సిద్దిపేట ఇప్పటి సిద్దిపేటను గుర్తుచేసుకుంటే ఎంత అభివృద్ధి సాధించిందో మన కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. పచ్చదనం పరిశుభ్రత, ఆరోగ్య రక్షణలో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందన్నారు.
పట్టణంలో ప్రతి రోడ్డును అద్దంలా చేసుకున్నామన్నారు. పారుపల్లి వీధిలో ఉన్న భోగేశ్వరాలయం, రామాలయం, రావిచెట్టు హనుమాన్, శివాలయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. పారుపల్లి స్కూల్ను అద్భుతంగా నిర్మించుకున్నమని, ఈ సంవత్సరం ఆంగ్లమాద్యమంలో విద్యాబోధన చేపట్టినట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నామని, త్వరలో గుండె ఆపరేషన్లు, కాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. మరో 650 పడకల దవాఖాన ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. అన్నిరకాల వైద్య సేవలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. మీలో కుటుంబ సభ్యుడిగా సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నట్లు, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనుకరాజు, నాయకులు పాల సాయిరాం, కౌన్సిలర్లు ఉదర జయావెంకట్రెడ్డి, నాయకులు మణిదీప్రెడ్డి, దరిపల్లి శ్రీను పాల్గొన్నారు.
ఆలయాల్లో మంత్రి పూజలు
సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో మంత్రి హరీశ్రావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని సిద్దిపేట టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంగారు మైసమ్మ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్స్అండ్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కార్యదర్శి మహేశ్ మంత్రిని శాలువాతో సన్మానించారు. నోట్ పుస్తకాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు మొక్కను నాటారు. సిరిసిల్ల రోడ్డులో ఉన్న పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి వెంట కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.