తూప్రాన్, డిసెంబర్ 23: పేక ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్కుమార్ తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ పీటీ శివారులో గల మామిడి తోటలో 8 మంది పేక ఆడుతున్నట్లు సమాచారం మేరకు వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు.
పేకాట స్థావరం వద్ద రూ. 76,710 నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు వడ్ల ప్రభాకర్, దాచారం కుమార్, ఎండీ అమీర్, నునావత్కుమార్, పెంజర్ల రాజేంద్ర ప్రసాద్, పైనము సాయికుమార్, అయ్యగారి ప్రశాంత్, ఎస్కే మగ్దుం అల్లీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.