తూప్రాన్/రామాయంపేట : తూప్రాన్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని గత ఏడున్నర సంవత్సరాల కాలంగా రూ.103 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు చేపట్టామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వార్డులలో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలకు శిలాఫలకాలను వారు ఆవిష్కరించారు.అనంతరం బస్టాండు వద్ద మొక్కలు నాటి నూతనంగా వైకుంఠరథాన్ని ప్రారంభించి ఎంపీ మాట్లాడారు. తూప్రాన్ పట్టణం, మండలాన్ని నందనవనంగా తయారు చేస్తామన్నారు.
ఇప్పటికే కోట్లాది రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.కాళ్లకల్ నుంచి జాతీయ రహదార్లపై రామాయంపేట, రెడ్డిపల్లి ప్రాంతాలలో త్వరలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జీలకు శంకుస్థాపనలు, ప్రమాదాల నివారణకు హైవేపై న్యూ లైటింగ్ సిస్టంను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే తూప్రాన్ మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ కోరిక మేరకు సీఎం వద్దకు వెళ్లి అభివృద్ధి పనులకు నిధులు తెస్తానని అన్నారు. తూప్రాన్ పట్టణంలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ కార్యాలయం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
రైతు వేదికను జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గడ అధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, డివిజన్ వ్యవసాయ శాఖ సంచాలకులు సురేఖ, కమిషనర్ మోహన్, మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు సతీశ్చారి, ఎంపీడీవో అరుందతి, తాసీల్దార్ శ్రీదేవి, ఏవో.నుస్రత్, ఎంపీపీ గడ్డి స్వప్న, జడ్పీటీసీ రాణి, కౌన్సిలర్లు రఘుపతి, ఉమ, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, సత్యలింగం, వెంకటేశ్ యాదవ్ తదితరులున్నారు.ఎంపీ.కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి