సిద్దిపేటలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలోనిరసన
గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత
జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
గజ్వేల్ రైల్వే స్టేషన్లో ముందస్తు బందోబస్తు
సిద్దిపేట,జూన్ 20: ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్వీ నాయకులు రమేశ్, సతీశ్,రాములు, ఆదర్శ్,గోపి, సతీశ్,రాజశేఖర్, శ్రీనివాస్, విజయ్, చంద్, కిశోర్ పాల్గొన్నారు.
‘అగ్నిపథ్’ను వెనక్కి తీసుకోవాలి
గజ్వేల్,జూన్ 20: అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలంటూ గజ్వేల్ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం టీఆర్ఎస్వీ నాయకులు కండ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్వీ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్రెడ్డి , నాయకులు కుమార్, ప్రవీణ్, కన్నా యాదవ్, నవాజ్, సాయిమహేశ్, షాదుల్, రాజు, శివకుమార్,యాదగిరి పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తు
గజ్వేల్ రైల్వేస్టేషన్లో పోలీసులు సోమవారం బందోబస్తు నిర్వహించారు. అగ్నిపథ్ ఆందోళనలో భాగంగా ఆర్మీ ఉద్యోగఅభ్యర్థులు సోమవారం బంద్కు పిలుపునివ్వడంతో రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం జరుగకుండా ముందస్తుగా సోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం వరకు ఎలాంటి ఆందోళనలు జరుగలేదు.
అగ్నిపథ్ను కేంద్రం ఉపసంహరించుకోవాలి
బెజ్జంకి, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో నాయకులు బిగుల్ల మోహన్, మహేశ్, శేఖర్బాబు, దేవయ్య, సంతోష్, బాలనర్సు, తిరుపతి, శ్రీనివాస్, శంకర్, శివ,నవీణ్ ఉన్నారు.
నారాయణరావుపేటలో..
నారాయణరావుపేటలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో అగ్నిపథ్కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్వై నేతలు భాస్కర్, సతీశ్, బాబు, అమర్, సంతోష్ పాల్గొన్నారు.
ముండ్రాయిలో ..
నంగునూరు, జూన్ 20 : మండలంలోని ముండ్రాయిలో అగ్నిపథ్కు వ్యతిరేకంగా వరంగల్ హైవేపై టీఆర్ఎస్వీ నాయకులు బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు గోవిందారం రవి, మాజీ అధ్యక్షుడు భిక్షపతి, రాజేందర్, సర్పంచ్ కమలాకర్రెడ్డి, ఉప సర్పంచ్ లింగం, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
కండ్లకు గంతలతో..
చిన్నకోడూరు, జూన్ 20 : అగ్నిపథ్ను రద్దు చేయాలని చిన్నకోడూరులో టీఆర్ఎస్వీ నాయకులు కండ్ల్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గుజ్జ రాజు, జిల్లా నాయకులు భిక్షపతి, ఉపాధ్యక్షుడు శ్రవణ్గౌడ్, నాయకులు రాజశేఖర్రెడ్డి, మహేశ్, లింగం, స్వామి పాల్గొన్నారు.