సంగారెడ్డి, డిసెంబర్ 23: బీఆర్ఎస్ నిరసనలతో జిల్లా కేంద్రం దద్ధరిల్లిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, నా యకులతో సంగారెడ్డి నిండిపోయింది. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ చిన్న రాష్ట్రంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నది. అన్నదాతలు ధాన్యం ఆరబెట్టే కల్లాల నిర్మాణాలకు ఖర్చు చేసిన నిధులను వాపసు చే యాలని నోటీసులు జారీ చేయడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవా రం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో స్థాని క ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్, డీసీఎంఎస్ చైర్మన్, డీసీసీబీ వైస్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జడ్పీటీసీలు, సీడీసీ చైర్మన్లు, ఆత్మకమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర బీజేపీ పాలకులు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విషం చిమ్ముతున్నదని తీవ్రంగా దుయ్యబట్టారు. జాతీయ ఉపాధిహమీ పథకంలో రైతులకు అవసరమైన కల్లాలను నిర్మించి పంటలు అరబెట్టుకునే కల్లాలకు ఖర్చు చేసిన నిధులు తిరిగి కేంద్రానికి వాపసు చెల్లించాలని నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. తక్కువ కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక నిధులు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం రైతులపై బీజేపీకి ఉన్న చిత్తుశుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. మహాధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్..
– డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్
ఉద్యమమే ఉపిరి చేసుకుని స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపితగా అవతరించారు. స్వరాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసి రైతుబంధావుడిగా సీఎం కేసీఆర్ మారారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా, సంగారెడ్డి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. తెలంగాణలో పండుతున్న పంటలను చూసి ఓర్వలేకనే ఉపాధి నిధులను వాపసు చెల్లించాలని కేంద్రం కుట్రపన్నుతున్నది.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
– పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రైతు సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేసి రైతు పక్షపాతిగా అవతరించిన గొప్ప నాయకులు సీఎం కేసీఆర్. దేశానికి బీజేపీ రూపంలో శని పట్టింది, దానిని తొలిగించేందుకు సీఎం కేసీఆర్ దేశానికి అవసరం. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల ప్రజలు ఇక్కడ ఎందుకు పుట్టలేదని, తెలంగాణలో పుడితే తమకు ప్రభుత్వ పథకాలు అందేవనే ఆలోచనలో ఉన్నరన్నారు. రైతు సంక్షేమానికి అమలు చేసిన పథకాలను దేశ ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ప్రధాని కావాలి.
కరెంటు కోతలు, తాగు నీటి కష్టాలు లేవు..
– నరహరిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
గత కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, తాగు, సాగు నీటి కష్టాలతో ప్రజలు అల్లాడారు. అలాంటి పరిస్థితులను తెలంగాణ ప్రజలు కలలో కూడా ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో శాస్వత నీటి కష్టాలు, కోతల కరెంటు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకనే కక్ష పూరితంగా బీజేపీ ప్రభుత్వం విషం చిమ్ముతుందన్నారు.
మోదీని ఇంటికి పంపించడానికే ఢిల్లీకి కేసీఆర్..
– బీరయ్య యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
దేశంలో సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై విసుకు వచ్చింది, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తున్నది. ప్రధాని మోదీని శాశ్వతంగా ఇంటికే పరిమితం చేసేందుకు హైదరాబాద్కా షేర్ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారు. కాంగ్రెస్ హయాంతో దేశం అప్పులు రూ.43 లక్షల కోట్లు ఉంటే, బీజేపీ సర్కార్లో రూ.100 లక్షల కోట్లకు పెరిగింది. దేశానికి అప్పులు పెంచుతూ మధ్య, సామాన్య ప్రజలపై నిత్యవసర ధరల మోత మోగిస్తున్నారు. కుల, మతాలతో కోట్లాటలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.
కార్పొరేషన్లకే పెద్దపీట వేసిన బీజేపీ..
– వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణలో అన్నదాతలను ఆందోళనకు గురిచేసేందుకు కల్లాల నిధులు తిరిగి కేంద్రానికి చెల్లించాలని కొర్రీలు పెట్టడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. కుల, మతాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేస్తుంది. బీజేపీ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తరిమి కొట్టేందుకు అన్నదాతల్లో చైతన్యం రావాలి.
పట్టువీడని విక్రమార్కుడు సీఎం కేసీఆర్..
– కాసాల బుచ్చిరెడ్డి, సీడీసీ చైర్మన్ సంగారెడ్డి
పోరాటమంటే కేసీఆర్., పట్టువీడని విక్రమార్కుడిలా పోరాటం చేస్తారు. ఇది గుర్తించే బీజేపీ ప్ర భుత్వం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురుచేస్తున్నది. 2004లో ప్రజలు, రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకోకపోవడంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు బొందపెట్టిన విషయం బీజేపీ తెలుకోవాలి. కేసీఆర్ మొం డోడు కాబట్టి చిరుగుర్లో ఉన్నప్పుడే చిదిమివేయాలనే తప్పుడు ఆలోచనలో మోదీ ఉన్నారు, ప్రస్తుతం దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని ప్రజలు గుర్తించడంతో బీఆర్ఎస్ను ప్రారంభించారు. తెలంగాణను ఏడారి చేసేందుకు గుజరాత్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు సాగనివ్వం.
గుజరాత్లో మూడు గంటల కరెంటే…
– కుంచాల ప్రభాకర్, జడ్పీ వైస్ చైర్మన్
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో సేద్యానికి మూడు గంటల కరెంటు సరఫరా చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో రైతులకు ఉపయోగపడే కల్లాలు నిర్మిస్తే ఆంక్షలు విధిస్తూ ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించాలని కోరడం సిగ్గుచేటు. ప్రధాని మోదీకి దమ్ము, ధైర్యం ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అందించాలి. ఈసారి దేశ వ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీని బొందపెట్టడం ఖాయం.
కేసీఆర్ పాలన రైతుల పక్షం..
– విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్
తెలంగాణలో కేసీఆర్ పాలన రైతుల పక్షంగా సాగుతున్నది, రాష్ట్రంపై విషం చిమ్మేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం విఫలమవుతూనే ఉన్నాయి. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తెస్తున్న బీజేపీకి తెలంగాణ ఎదురు దెబ్బతగలడం ఖాయమని తెలుసుకుని రైతులు నిర్మించిన కల్లాల నిధులపై దృష్టి పెట్టి తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం ద్వందనీతికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే ఆదేశాలు
ఉపసంహరించుకోవాలి.
రైతులకు ఖర్చు చేసిన నిధులు వాపసు చెయ్యాలా..
– సిద్ధన్న పాటిల్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్
అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుని వ్యవసాయ సంక్షేమానికి కట్టుబడి పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్పై కేంద్రం విషం చిమ్మడం సమంజసం కాదు. రైతు వ్యతిరేక చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజావ్యతిరేకత చూసింది. ప్రస్తుతం తెలంగాణ రైతాంగంపై విషంకక్కే ప్రయత్నం చేయడం మానుకోవాలి. కార్పొరేట్లకు రూ.18 లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రం, రైతులు ధాన్యం ఆరబెట్టుకోడానికి కల్లాలను నిర్మాణాలకు ఖర్చు చేసిన రూ.151 కోట్లను చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేకి బీజేపీ ప్రభుత్వం…
– భిక్షపతి, జాగృతి రాష్ట్ర నాయకుడు
దేశ ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుండడం సిగ్గుచేటు. దేవవ్యాప్తంగా అన్నదాతలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అవతరించింది. 60 లక్షల సభ్యత్వాలున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీ పాలనపై ప్రజలకు వివరించి చైతన్యవంతం చేస్తాం.