Farmers | నిజాంపేట, ఫిబ్రవరి 9: రజక్ పల్లికి చెందిన రైతు పరుశరాములు తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్కు మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన సమీప రైతులు వెంటనే బాధిత రైతు పరశురాములును సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు.
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మత్తులు చేయుమని నాలుగు నెలలుగా విద్యుత్ అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్మెన్ రమేష్, ఏఈ గణేష్ లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని రైతులు కల్వకుంట గ్రామ ప్రధాన రహదారిపై సోమవారం బైఠాయించారు.
సరిపడా కరెంటు కూడా సరఫరా చేయడం లేదని.. చేతులు పైకి లేపితే అందే విధంగా విద్యుత్ తీగలు ఉన్నాయని, కరెంటు సమస్యలు తీర్చనోళ్లు నశించాలి.. రైతుల బాధలు పరిష్కరించాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి నిజాంపేట పోలీసులు చేరుకొని రైతులకు సర్ధి చెప్పారు. ప్రమాదానికి కారణమైన ట్రాన్స్ఫార్మర్లు పోలీసులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజం గోపాలస్వామి కొమురయ్య స్వామి కనకరాజు మహంకాళి కనకరాజు పరుశురాములు సత్యనారాయణ స్వామి నర్సింలు తదితరులు ఉన్నారు.

Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్