మెదక్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : హవేళీఘనపూర్ శివారులోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మెదక్ 34, నర్సాపూర్ 37 నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, నవంబర్ 15లోపు సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్నెట్, మీడియా పాయింట్, బారికేడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.
కౌంటింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరచడానికి పిల్లికోటాల్లోని పాత కలెక్టర్రేట్ను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాస్, తహసీల్దార్లు శ్రీనివాస్, నారాయణ, పీఆర్ ఈఈ నర్సింహులు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.