సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు ప్రతి రోజు సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయా వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఆంక్షలు…
స్పెషల్ ఆర్టీసీ బస్సులు..
హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రారంభమయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. తాజాగా నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ప్రదర్శనకు వచ్చే వారి కోసం 25 డిపోల నుంచి బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 12 వరకు 111 బస్సులు, ఆ తర్వాత జనవరి 13 నుంచి ఎగ్జిబిషన్ ముగిసే వరకు పని దినాల్లో 164 బస్సులు, సెలవు రోజుల్లో 218 బస్సులను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.