అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయ జయ రామ’ అని భక్తుల రామ నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. వరుడిగా రాముడు, వధువుగా సీతమ్మను చూసి భక్తులు పులకించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
-మెదక్/సంగారెడ్డి జిల్లాల నెట్వర్క్, మార్చి 30