ఆకస్మిక దాడులు చేసి కేసులు నమోదు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా
సంగారెడ్డి కలెక్టరేట్, మే 16: పొగాకు రహిత జిల్లాయే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు పని చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రో గ్రాంపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, కార్మిక, పోలీసు, విద్య తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ పొగాకు వినియోగించకుండా ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు, కా ర్మిక, మున్సిపల్శాఖల అధికారులు పొగాకు సం బంధిత మత్తు పదార్థాల అమ్మకాలు నియంత్రించడంలో కీలకపాత్ర వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, జన సమర్థం ఉండే అన్ని ప్రాంతాల్లో పొగాకు ఏ రూ పంలో ఉపయోగించినా నేరమని, రూ.200 జరిమానా విధిస్తారని ఫ్లెక్సీలు, పెయింటింగ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసుశాఖ దాడులు చేసి అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని వివరించారు. ఏఏ షాపు ల్లో, ఏ ప్రాంతంలో పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయో వివరాలు సేకరించి ఆకస్మికంగా దాడులు చేయాలని సూచించారు. పొగాకు వినియోగం ద్వారా కలిగే నష్టాలను, అమ్మినా, వినియోగించినా చట్టరీత్యా నేరమని, అందుకు అమలు చేసే శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి రెగ్యులర్గా తనిఖీలు చేపట్టాలన్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద బోర్డులో పెట్టాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో 120 కేసులు నమోదు
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 120 కేసులు నమోదు చేశారని, 191 మందిని అరెస్టు చేసినట్టు అదనపు కలెక్టర్ వెల్లడించారు. 18 ఏండ్లలోపు పిల్లలకు అమ్మినా, వారిచే అమ్మించినా చట్టరీత్యా నేరమని, విద్యా సంస్థల పరిసరాలకు 100 మీటర్ల దూరంలో పొగాకు సంబంధించిన దుకాణాలు ఉండరాదని తెలిపారు. సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమని, సెక్షన్ 5 ప్రకారం పొగాకు సంబంధించిన ప్రకటనలు చేయడం నేరమని స్పష్టం చేశారు. ఆరోగ్య హెచ్చరికలకు సంబంధించిన చిత్రపటాలు విధిగా ఉంచాలని చెప్పారు. పొగాకు అలవాటు మానేందుకు 18001 12356/ 01122 901701లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చని స్పష్టం చేశారు. అనంతరం వైద్య, ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ రూపొందించిన ఈప్రాంతం, భవనం పొగా కు రహితంగా నిర్దేశించడమైనదని తెలిపే చార్ట్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, ఎన్టీసీపీ స్టేట్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, పోలీసు, విద్య, కార్మిక, పరిశ్రమలు, ఎస్సీడీపీసీ, టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం లీడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.