సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉండగా.. కొత్తగా 37,753 మంది చేరడంతో ఓటర్ల సంఖ్య 13,93,711కు పెరిగింది. జిల్లాలో 7,02,484 పురుష ఓటర్లు ఉండగా.. 6,91,099 మహిళా ఓటర్లు, 128 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గంలో 3,97,237 మంది, అత్యల్పంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,31,188 మంది ఓటర్లు ఉన్నారు.
సంగారెడ్డి, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో తుది ఓటరు జాబితాను అధికారులు ప్రచురించారు. అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో ఓటర్ల 13,93,711కు చేరుకున్నది. ఇటీవల యువ ఓటర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఎన్నికల షెడ్యూల్కు ముందు ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య 13,55,958 ఉండగా, తుది ఓటరు జాబితా ప్రచురణలో ఓటర్ల సంఖ్య 13,93,711కు పెరిగింది. ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో సైతం అర్హులైన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. 18 ఏండ్ల వయస్సు దాటిని యువకులు ఇతరులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కుకోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. 37,753 మంది కొత్తగా ఓటరు జాబితాలో చేరారు. దీంతో ఓటర్ల సంఖ్య 13,93,711కు పెరిగింది. జిల్లాలో 7,02,484 పురుష ఓటర్లు ఉండగా, 6,91,099 మహిళా ఓటర్లు, 128 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,31,188 మంది ఓటర్లు, అందోల్లో 2,49,248, జహీరాబాద్లో 2,70,785 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 2,45,253, పటాన్చెరు నియోజకవర్గంలో 3,97,237 మంది ఓటర్లు ఉన్నారు.