పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వెంకటాపురం గ్రామానికి చెందిన గోపని మహేందర్ (29) ఆదివారం సాయంత్రం గోపని రుక్కమ్మ అనే మహిళ వ్యవసాయ బోరు చెడిపోయిందని చూడడానికి పిలిచిందన్నారు.
కాగా, రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినప్పటికి జాడ దొరకలేదన్నారు. సోమవారం ఉదయం బోరుబావి వద్దకు వెళ్లి చూడగా వేపచెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పది స్థితిలో శవమై కనిపించాడన్నారు.
మహేందర్ మృతిపై పలు అనుమానాలున్నాయని, మృతుడి తల్లి గోపని సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శవాన్ని పోస్టుమార్డం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు.