మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేడుకలకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి భక్తుల జాగరణ కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.