మెదక్, (నమస్తే తెలంగాణ) నవంబర్ 2 : మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెకింపు వరకు అన్ని ఏర్పాట్లు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ శుక్రవారం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పలు అంశాల గురించి వివరించారు. మెదక్ జిల్లాలో 4,37,015 మంది ఓటర్లు ఉన్నారన్నారు.జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో మెదక్లో 274, నర్సాపూర్లో 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
మెదక్ నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 2,15,043 ఉండగా, అందులో మహిళలు 1,12,218 మంది కాగా, పురుషులు 1,02,820 మంది ఉన్నారు. థర్డ్ జండర్లు ఐదుగురు ఉన్నారు. అలాగే పీడబ్ల్యూడీ ఓటర్లు 3839 మంది కాగా, 80 ఏండ్లకు పైబడిన వారు 2446 మంది ఉన్నారు. యువత ఓటర్లు 8098గా ఉన్నారన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,972, అందులో మహిళలు 1,13,551 కాగా, పురుషులు 1,08,414 మంది ఉన్నారు. థర్డ్ జండర్లు ఏడుగురు కాగా, పీడబ్ల్యూడీ 4,531 మంది కాగా, 80 ఏండ్లపై బడిన వారు 1716 మంది ఉన్నారు. యువ ఓటర్లు 8104 మంది ఉన్నారన్నారు.
మెదక్ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో రూ.1.41.09. 480 నగదు సీజ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మొత్తం 55 కేసులు నమోదు కాగా, రూ.1,41,09,480 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే 55 దరఖాస్తులు రాగా, అందులో 41 దరఖాస్తులను పరిశీలించి పత్రాలు సరిగ్గా ఉన్న వాటిని విడుదల చేశామని చెప్పారు. ఇదిలావుండగా ఎంసీసీ ద్వారా రూ.12 లక్షల 920 నగదును ఎఫ్ఎస్టీ ద్వారా సీజ్ చేశామని తెలిపారు. ఇందులో రూ.1,31, 63,647 నగదును పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేసిందన్నారు. 27690 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్టు పేరొన్నారు. మొత్తం ఎంసీసీ ఆధ్వర్యంలో 30 దరఖాస్తులు వచ్చాయని, సీ.విజల్ ద్వారా 22 దరఖాస్తులను స్వీకరించామని తెలిపారు.
జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామగ్రి సర్వం సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెకింపు, ఫలితాల ప్రకటన వరకు రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. అభ్యర్థ్ధి నామినేషన్లో అఫిడవిట్లో ఫామ్ 26, ఫామ్ ఏబీ నింపాలని, ఒక అభ్యర్థి 4 సెట్ల్ల నామినేషన్లు వేయాలని, అభ్యర్థి డిపాజిట్ ఫీజు జనరల్ అభ్యర్థ్ధికి రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థ్ధికి రూ. 5000గా ఈసీఐ నిర్దారణ చేసిందని, నామినేషన్ వేసే అభ్యర్థి సరైన పత్రాలు సమర్పించాలని సూచించారు. నామినేషన్కి వచ్చే వాహనాలు ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో నిలపాలని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలు KYC (know your candidate app )ద్వారా తెలుసుకోవచ్చని, గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి KYC డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం kyc పోస్టర్ను విడుదల చేశారు.
జిల్లాలో రూ.1,81,55,708 నగదును సీజ్ చేశామని జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. అంతేకాకుండా 2503 లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేశామని, పీడీఎస్ రైస్ 570 క్వింటాళ్లు సీజ్ చేశామని, మొత్తంగా రూ.1,99,25,988 విలువ ఉంటుందని చెప్పారు. ఎంసీసీ ఫిర్యాదులలో 30 ఫిర్యాదులు వచ్చాయని, సీ-విజిల్ ద్వారా 22 ఫిర్యాదులు వచ్చాయని పేరొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు డోర్ టు డోర్ ప్రచారం, హెలిక్యాప్టర్, హెలీప్యాడ్, పార్టీ ఆఫీస్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ర్యాలీ, వాహనాల పర్మిషన్, వివిధ రకాల పర్మిషన్లు మొత్తం 110 వచ్చాయని అందులో 48 అనుమతి ఇచ్చామని, 12 అనుమతి నిరాకరిచామని, పరిశీలనలో 25, పెండింగ్లో 25 ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్వో అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ ఆర్వో శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు .
మెదక్ జిల్లా వరి ధాన్యం కొనుగోలు 2023-2024కు సంబంధించిన కంట్రోల్ రూమ్ను జిల్లా రైతులు ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ధాన్యం కొనుగోలుకు 2023-24కు సంబంధించిన సమస్యల పరిషారానికి కంట్రోల్ రూమ్ను సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభిచారు. కంట్రోల్ రూమ్ రోజూ ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుందన్నా రు. ఈ సేవలను రైతులు వినియోగించుకొని ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9281103685 కు ఫోన్ చేసి సమస్యను పరిషరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీవో కరుణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ ఎండీ సాధిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల స్వీకరణ
13వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
15న ఉపసంహరణ గడువు, తుది జాబితా ప్రకటన
30న ఉదయం 7 నుంచి 5 గంటలకు పోలింగ్
డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన