చేగుంట, సెప్టెంబర్ 24: క్రీడలతో ఆరోగ్యం చేకూరు తుందని మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన క్రికెట్ లీగ్ (సీసీఎల్)ను ఆదివారం ప్రారంభించారు. కొంతసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యాన్నిస్తాయన్నారు. చేగుంటలో స్టేడియం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
చేగుంటలో యువకులు ముందుకొచ్చి క్రికెట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడలు నిర్వహిస్తున్న క్రాంతి కుమార్, అన్న రవి, సాబేర్, డిష్ రాజు, పులుబోయిన రవి, కాంశెట్టి సతీశ్, సోమ రవి, మంచికట్ల వంశీ, మహ్మద్ ఆలీని ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ చేగుంట మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి, అంజగౌడ్, లక్ష్మణ్ తదితరులున్నారు