మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శాకం దుర్గయ్య(36) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో రోజువారిలాగే గురువారం రాత్రి చేపలవేటకు స్థానిక హాల్దీవాగులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు వాగులోని నీటికుంటలో పడి మృతిచెందాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య స్వప్న, కొడుకు, కూతురు ఉన్నారు. దుర్గయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.