పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ్ఖేడ్ పట్టణానికి చెందిన ఆరే భరత్(47) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
తోటి డ్రైవర్ మహ్మద్ కబీర్తో కలసి పెద్దపల్లి వద్ద నుంచి ఇసుక లోడ్ కోసం గురువారం రాత్రి బయలు దేరారు. లారీని కబీర్ నడుపుతున్నాడు. రాత్రి 12గంటల సమయంలో మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో భరత్ ఉమ్మివేసే ప్రయత్నంలో లారీ వేగానికి అదుపు తప్పి కిందపడి పోయాడు.
దీంతో తల, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయని గమనించిన కబీర్ వెంటనే లారీ పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన భరత్ను స్థానికులు చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతి వేగంగా లారీని నడిపి తన భర్త మృతికి కారణమైన లారీ డ్రైవర్ కబీర్ పై చర్యలు తీసుకోవాలని భార్య సుమిత్ర ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.