మెదక్ అర్బన్, నవంబర్ 10: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ డాక్టర్ కాదని, అంతా గంజాయి సోపతేనని ‘బీజేవైఎం ఆల్ ఇండియా’ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాయిప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్ మాట్లాడుతూ.. మైనంపల్లి జూఠా మాటలు మానుకోవాలని.. ఝాటా మాటల్లో అయ్యా నంబ ర్ వన్, కొడుకు దస్ నంబర్ అంటూ ఎద్దేవా చేశారు. మైనంపల్లి హన్మంతరావు 2008 (ఉప ఎన్నిక), 2009 సంవత్సరాల్లో మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ను అభివృద్ధి చేసిందేమీ లేదని,కొర్విపల్లిలో మైనంపల్లి కిషన్రావు మోమోరియల్ మల్టీ స్పెషల్ దవాఖాన శిలఫలకం వేసిండు. ఇప్పు డు కూడా అక్కడ శిలఫలకం మాత్రేమే ఉందని దవాఖాన లేదని ఆరోపించారు.మెదక్ సెట్ కాదని 13 ఏండ్లుగా మల్కాజిగిరికి వెళ్లారని, కొడుకు మల్కాజిగిరిలో ఎంపీ టీక్కెట్ ఆశిస్తే అక్కడ దొరకలేదని, దీంతో మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడుకుని పోటీ చేస్తున్నారని ఆరోపించారు. మైనంపల్లి రోహి త్ ఏ రోజూ కళాశాలకు వెళ్లలేదని, అసలు రోహిత్ డాక్టర్ కాదని.. ఫేక్ డాక్టరని, ఆయన ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లను వారం రోజుల్లో బయటకు తీసుకువస్తామని సవాల్ విసిరారు. మెదక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మైనంపల్లి మాయలోపడవద్దని సూచించారు.
హన్మంతరావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచి ఎంతో మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి మల్కాజిగిరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిండని ఆరోపించారు. ఎంఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ ద్వారా సేవ పేరుతో ఖర్చు చేస్తున్న డబ్బులు మైనంపల్లి సొంత డబ్బులా లేక ఆ ట్రస్ట్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే నిధులు సంగతి తేల్చాలని ప్రశ్నించారు. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో సొంత డబ్బుతో ఏం ఖర్చు పెట్టాడో చెప్పాలని.. దమ్ముంటే మెదక్ చౌరస్తాకు మళ్లీ వస్తా.. ప్లెస్ నువ్వు డిసైడ్ చెయ్.. అంటూ సాయిప్రసాద్ సవాల్ విసిరారు. కార్యక్రమంలో స్థానిక బీజే పీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.