పాపన్నపేట, జూన్ 8 : భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు , బోనాలు మొక్కలు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, శ్యాం, బ్రహ్మచారి, బత్తినిరాజు, నర్సింలు, మహేష్, వరుణాచారి, యాదగిరి నరేష్, దీపక్, తదితరులు ఏర్పాటు చేయగా వేదపండితులు శంకర శర్మ, పార్థివ శర్మ , రాము , రాజాశేఖర్ నాగరాజు తదితరులు పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక బందో బస్త్ చర్యలు చేపట్టారు.