అందోల్, ఆగస్టు 6: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లు ఆదివారం అసెంబ్లీలో ఆమోదిచడంతో ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ జోగిపేటలో సంబురాలు జరుపుకొన్నారు. జోగిపేట ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమని తమ కుటుంబాలు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాయని అన్నారు.
మెదక్లో..
మెదక్ అర్బన్, ఆగస్టు 6: టీఎస్ ఆర్టీసీ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన బిల్లును అసెంబ్లీలో ఆమెదించడంతో మెదక్ ఆర్టీసీ డిపో ఉద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని డిపో ఎదుట పటాకులు కాల్చి, మిఠాయిలు తీనిపించుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.