కొల్చారం, అక్టోబర్ 28 : ఆడపిల్లల పాలిట పెద్దన్న సీఎం కేసీఆర్ అని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఇంచార్జి ఆర్డీవో సాయిరాంతో కలిసి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరిశంకర్, తహసీల్దార్ చంద్రశేఖర్రావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, గిర్దావర్ శ్రీహరి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.