రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోధుమల లారీ అదుపుతప్పి మార్గమధ్యంలోని రామాయంపేట జాతీయ రహదారి వద్ద బోల్తా పడినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలు కావడంతో వెంటనే వారిని 108 అంబులెన్సులో రామాయంపేట ప్రభత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.