మెదక్ అర్బన్, జూన్27: మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మెదక్ శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నూతనంగా ఎన్నికైన మెదక్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కలెక్టర్ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. రక్తనిధి కేంద్రాన్ని, వృద్ధులకు ఆశ్రమాన్ని, ఇతర సేవాకార్యక్రమాలను కొనసాగించడానికి ఎకరం స్థలం కేటాయించాలని, ప్రస్తుతమున్న కలెక్టరేట్ కాంప్లెక్స్లో కేటాయించిన మూడో అంతస్తులోని 301 రూమును ఇప్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రూమును కేటాయిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్ సింగం శ్రీనివాస్రావు భవిష్యత్తులో రక్తనిధి కేంద్రం, మొబైల్ వ్యాన్ కోసం ప్రతిపాదనలను కలెక్టర్కు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, ఆర్డీవో సాయిరాంను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పి.లక్ష్మణ్, కార్యదర్శి సుభాష్, కోశాధికారి డీజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ, జూన్27: ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘం సభ్యులు కలెక్టర్ రాజర్షిషాకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రాగి అశోక్, శివరామకృష్ణ, వెంకటనారాయణ, రవీందర్, చంద్రశేఖర్, కల్యాణ్, రాధాకృష్ణ, శంకర్, శ్రీనివాస్, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు.