మెదక్ అర్బన్, ఫిబ్రవరి 7: ఇటుక బట్టీల్లో కార్మికులను వేధిస్తున్న ఇటుక బట్టి యజమానిని మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన ముగ్గురు పురుషులను, ఇద్దరు మ హిళలను, ఒక మైనర్ బాలుడిని మాచవరం దగ్గరలోని ఇటుక బట్టిలో రెండు సంవత్సరాలుగా పనిలో పెట్టుకుని వారికి సరిగ్గా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు సొంత రాష్ర్టానికి చెందిన బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో పోస్ట్పెట్టారు. మంత్రి కేటీఆర్ వెంటనే అడిషనల్ డీజీ మహేశ్ భగవత్కు సమాచారం ఇచ్చారు. మహేశ్ భగవత్ ఉమ్మడి మెదక్ జిల్లా సీఐడీ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లుకు దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
డీజీ ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ మండలంలోని మా చవరం దగ్గరలో ఉన్న ఇ టుక బట్టీల వద్దకు సీఐడి బృందం చేరుకుని ఆరుగు రు బాధితులు గత్పల్ రా ణా, సురేంద్ర రాణా, ము కుందరాణా, నీర్బాజాయ్, ప్రకాశ్రాణాలను కాపాడారు. నర్సాపూర్ అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యేంద్ర ప్రసాద్ బాధితులకు రావాల్సిన రూ. 37,000 యాజమాని లక్ష్మీనారాయణ వద్ద నుంచి బాధితులకు ఇప్పించాడు. అనంతరం బాధితులను ‘ప్రజ్వల సంస్థ’ వాహనం ద్వారా సొంత రాష్ర్టానికి ఉచితంగా పంపించారు. ఇటుక బట్టి యజమానిపై అండర్ సెక్షన్ 14(1) చైల్డ్ లేబర్ యాక్ట్, 23, 16మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఇటుక బట్టి యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమలో సీఐడీ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, సీఐడీ సీఐలు, జగదీశ్వర్, సురేశ్, మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై పాల్గొన్నారు.