మెదక్ అర్బన్, అక్టోబర్ 19 : ప్రతిష్టాత్మక దేవస్థానం యాదగిరిగుట్టకు మెదక్ ఆర్టీసీ డిపో నుంచి నడిచే సర్వీస్ను ఆక్యుపెన్సీ లేని కారణంగా గత కొద్దిరోజులుగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మెదక్ స్థానిక నేతలు మంగళవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ మెదక్ ఆర్ఎం తో మాట్లాడి వెంటనే మెదక్ డిపో నుంచి యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు రెండు రోజుల్లో యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పీఆర్వో తెలిపారు.