వర్గల్, అక్టోబర్ 26 : మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ వేసిన సీసీ రోడ్లు, తారురోడ్లు ఇప్పుడు హరితహారం చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి. ఒకప్పుడు ఏ ఊరికి వెళ్లాలన్నా గుంతలు పడ్డరోడ్లు, రోడ్డుకు ఇరువైపులా కానరాని చెట్లు, ఎండకాలంలో ప్రయాణం చేసేవారు వడదెబ్బకు గురయ్యేవారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నది. నాడు అశోకుడు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటితే నేడు సీఎం కేసీఆర్ ఊరూరా దారులకు పచ్చనిపందిళ్లు వేశారు.
వేలూర్-అంతగిరిపల్లి గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు
దండుపల్లి-బొర్రెగూడెం గ్రామాల మధ్య కోనసీమను తలపిస్తున్న హరితహారం చెట్లు