మెదక్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరమని ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు సీఎంఆర్ చెకులను పంపిణీ చేశారు. మెదక్ నియోజకవర్గంలో రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన 33 మంది లబ్ధ్దిదారులకు మంజూరైన రూ.16,33,500 విలువైన చెకులను అందజేశారు. ఈ సం దర్భంగా ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా రోగ్యమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తు న్నదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జయరాజ్, రైతుబంధు సమితి రామాయంపేట మండల అధ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, కొర్వి రాము లు, మైసాగౌడ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
దర్గా అభివృద్ధికి రూ.4.50 లక్షలు మంజూరు :
దర్గా అభివృద్ధికి రూ. 4.50 లక్షలు మంజూరయ్యాయని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి అంబాజిపేటలో నిర్వహించిన ఉర్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నేతలు బుర్హానుద్దీన్ నవాజ్, బాగారెడ్డి, హేమచంద్రం, నవీన్గౌడ్, లక్ష్మణ్, సుధాకర్, దుర్గాపతి ఉన్నారు.